ఏపీ సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణ అంశంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ‘ఛలో అసెంబ్లీ’ చేపడతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగను జగ్గయ్యపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి ఆయన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం దళితులను చీల్చడానికేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జగన్ వ్యాఖ్యానించడం తగదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు.