telugu navyamedia
రాజకీయ వార్తలు

నైట్‌కర్ఫ్యూ పొడిగించిన తమిళనాడు…

తమిళనాడు స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వ‌చ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మ‌ళ్లీ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువ‌డే వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇక‌, మే 2వ తేదీన‌ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమ‌లుచేయ‌నున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. మే 2న కౌంటింగ్ ప్ర‌క్రియ‌తో పాటు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్ర‌కారం.. రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల మధ్య కర్ఫ్యూ అమ‌లులో ఉండ‌నుండ‌గా.. ఎలాంటి సడలింపులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దేశంలో నమోదవుతున్నా కేసులలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా తమిళనాడులో నమోదవుతున్నాయి.

Related posts