telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ఢిల్లీ టార్గెట్ ఎంతంటే…?

కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసారు ఢిల్లీ బౌలర్లు. కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(19) కూడా నిరాశపరిచాడు. అలాగే వీరి తర్వాత తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్, సునీల్ నరైన్, ఇద్దరు డక్ ఔట్స్ గా వెనుదిరిగారు. అయిన కూడా మరో ఓపెనర్ (43) తో రాణించగా చివర్లో ఆండ్రీ రస్సెల్(45) తో ఆకట్టుకున్నాడు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది కేకేఆర్. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండు వికెట్లు తీయగా మార్కస్ స్టోయినిస్, అవేష్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 155 పరుగులు చేయాలి. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఏం చేస్తుంది అనేది.

Related posts