telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు విశాఖ పర్యటన.. విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు

tdp chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా  మోహరించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts