మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. కథలో కీలకమైన పార్ట్కి సంబంధించిన చిత్రీకరణ ఇక్కడ జరుగుతుందని సమాచారం. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాలకి సంబంధించిన సన్నివేశాలని చాలా నేచురల్గా ఉండేట్లు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. పాండిచ్చేరిలో పాత కాలం నాటి కొన్ని పురాతన భవనాల్లో ‘సైరా’ టీమ్ షూటింగ్ జరుపుతోందనీ సమాచారం. అయితే ఈ చిత్ర ట్రైలర్ని మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.
previous post
next post