పవర్స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుపాటి రానా నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్కు రీమేక్గా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్’ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామేనన్, రానాకు జోడీగా సంయుక్త మేనన్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్, సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను డిసెంబర్ 1న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు అందిస్తుండగా..సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. జనవరి 12న సినిమా విడుదలకానుంది