రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెరకెక్కించనున్నాడు. పీరియాడిక్ సోషల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సురేష్ బాబు, సాయి పల్లవి, వేణు, వెంకటేష్తో పాటు పలువురు సినీ ప్రముఖులు లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, గొట్టిపాటి రవి స్విచాన్ చేశారు. డి సురేష్ బాబు స్క్రిప్ట్ అందజేశారు. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. వైజాగ్కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట.
previous post
next post
పెళ్లిపై ఇంట్రస్ట్ లేదు… వాళ్ళకోసమే అలా చెప్పా : సాయి ధరమ్ తేజ్