telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తలైవి : శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ కాదు…!

jishu

బాడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడులీవు ఏ.ఎల్ విజయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్(ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. ‘తలైవి’ బయోపిక్‌ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానుంది. దాదాపు 50 శాతం షూటింగ్ అయిపోయింది. అయితే జయలలిత జీవితంలో అలనాటి నటుడు శోభన్ బాబుది కీలక పాత్ర అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు జయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారని, వీరికి ఓ కూతురు ఉందని కూడా వార్తలు వచ్చాయి. జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబు పాత్రను చాలా కీలకం. శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండను ఎంపిక చేసుకోనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఎందుకంటే దర్శకుడు విజయ్ బాగా రీసెర్చ్ చేసి శోభన్ బాబు పాత్రకు ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తాను ఎంపిక చేసారు. ఇందుకోసం జిషు శోభన్ బాబు నటించిన సినిమాలన్నీ చూస్తూ తన క్యారెక్టర్‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్ అయిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో జిషు సేన్‌గుప్తా ఎల్వీ ప్రసాద్ పాత్రలో నటించారు. ఇటీవల యువ నటుడు నాగశౌర్య నటించిన ‘అశ్వద్థామ’ సినిమాలో సైకో పాత్రను పోషించారు.

Related posts