గత కొన్ని రోజులుగా కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకి అక్కడి పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలను వరదలు ముంచెత్తడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు సహాయం వారికి సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఆపదలో ఉన్న బాధితులకి తాము ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసే సూర్య సోదరులు కేరళ, కర్ణాటక ప్రజలకి భారీ విరాళం అందించారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిద్దరు పది లక్షల రూపాయల విరాళం అందించినట్టు కోలీవుడ్ టాక్. గతంలోను సూర్య సోదరులు వరద బాధితులకి సాయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య.. సుధా కొంగర దర్శకత్వంలో “సూరారై పొట్రు” అనే చిత్రం చేస్తుండగా, కార్తీ .. భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సుల్తాన్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ అన్నదమ్ములిద్దరూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నారు.
previous post