యంగ్ హీరో శర్వానంద్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా శ్రీకారం మూవీ నుండి అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నెల 19న ఈ సినిమా నుండి ”హెయ్ అబ్బాయి” రిటికల్ పాట విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ మధ్యే ఈ సినిమా టీజర్ను ప్రిన్స్ మహేష్ బాబు లాంచ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా మొత్తం వ్యవసాయం బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా ఈ మూవీ గ్రామీణ ప్రాంతలోనే తీసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి.
previous post
కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి