యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రతినాయకుడు రావణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం ‘తానాజీ’లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడైన ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందారు. అందుకే రావణుడి పాత్రకు ఆయనైతే న్యాయం చేయగలరని ఓం రౌత్ భావించారట. సైఫ్ కూడా ఈ పాత్రకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించే వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.
previous post
పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్