telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్… హైదరాబాద్ టార్గెట్…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేసింది. అయితే ముంబై జట్టుకి ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. కానీ సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరుస ఓవర్లలో రోహిత్ ,సూర్యకుమార్ ల వికెట్లు తీసి ముంబై ని దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రెండు సిక్సులు బాదడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్ ఒక్క వికెట్ తీసాడు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించాలంటే 151 పరుగులు చేయాలి. అయితే గత మ్యాచ్ లో కూడా ఇదే లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ ఓడిపోతే ఇదే లక్ష్యాన్ని కాపాడుకొని ముంబై గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts