telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీలో చేరనున్న సైనా నెహ్వాల్‌

Saina Nehwal bjp

భారత బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సైనా నెహ్వాల్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోంది. ఇంతకాలం క్రీడాకారిణిగా దేశం కోసం శ్రమించిన ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. ఈరోజు ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోబోతోంది.

29 ఏళ్ల సైనా ముందు నుంచి కూడా బీజేపీ మద్దతుదారుగానే ఉంది. తన కెరీర్ లో 24 ఇంటర్నేషనల్ టైటిల్స్ ను సైనా గెలుచుకుంది. 2009లో ప్రపంచ నెంబర్ టూ స్థానంలో కొనసాగిన సైనా… 2015లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా మెడల్స్ ను సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఆమె 9వ స్థానంలో కొనసాగుతోంది. 2018లో ఆమె మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడింది.

Related posts