telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కూతురు శరీరంపై వాతలు పెట్టిన కసాయి తల్లి

New couples attack SR Nagar

ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో ఓ తల్లి పెట్టిన వాతలకు నొప్పి తట్టుకోలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో విషయం బయటపడింది. చిన్నారి అరుపులు విని ఇంట్లోకి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు తల్లి రాక్షసత్వాన్ని చూసి నివ్వెరపోయారు. ఆమె నుంచి ఆ బాలికను విడిపించే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో దయామణి, అంగన్‌వాడీ సెక్టార్ పర్యవేక్షకురాలు పుష్పావతిలు సోమవారం బాధిత బాలిక ఇంటికి వెళ్లి విచారించారు. బాలిక శరీరంపై గాయాలు చూసి వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మంలోని బాలసదనానికి తరలించారు. పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts