తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. “వర్మ” అనే టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీ ఔట్పుట్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపింది. ఆ”దిత్యవర్మ” చిత్ర రిలీజ్కి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కాని దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న భారీ సంఖ్యలో విడుదల కానుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో నటించడం గురించి ధృవ్ స్పందించాడు. “ఈ సినిమా టీజర్ విడుదలైనపుడు చాలా విమర్శలు వచ్చాయి. నన్ను చాలా మంది తక్కువ చేసి మాట్లాడారు. నా నటనను విమర్శిస్తే ఓకే. కానీ, నా లుక్ను కూడా తప్పుపడితే నేను ఏమి చెయ్యాలి. ఈ సినిమా కోసం పొగ, మద్యం తాగాల్సి వచ్చింది. నాకు ఆ రెండు అలవాట్లూ లేవు. ఆ సీన్లలో నటించేటపుడు చాలా కష్టపడ్డా. పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నించా. ఇంట్లో వారితో మాట్లాడడం తగ్గించేశా. కావాలని కోపం తెచ్చుకుని ఇంట్లో వాళ్లపై అరిచేవాడ్ని. గదిలోకి వెళ్లి తాళం వేసుకుని ఒంటరిగా ఉండేవాణ్ని” అని ధృవ్ తెలిపాడు.
previous post
next post
రియల్ లైఫ్ లో బిడియం కలిగిన అమ్మాయినే… : రాశిఖన్నా