telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీవీ సింధుకు రాజ్ భవన్ లో సన్మానం

pv sindhu player

ప్రపంచ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో తెలుగుతేజం పీవీ సింధుస్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు హైదరాబాద్ రాజ్ భవన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

రాజ్ భవన్ దర్బార్ హాల్ లో పీవీ సింధును గవర్నర్ నరసింహన్ సన్మానించారు. అనంతరం పారా షట్లర్ మానసి జోషిని గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు కుటుంబసభ్యులు, పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts