telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ తన కుమార్తెలను లండన్ నుంచి ఎందుకు పిలిపించారు?: బుద్దా వెంకన్న

budda venkanna fire on ap govt

పారాసెట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్‌కు సామాన్యులపై పట్టింపు లేదని.. కానీ తన కుమార్తెల ఆరోగ్యంపై శ్రద్ధ ఉందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?’ అని ప్రశ్నించారు.’అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా?’ అని నిలదీశారు.

Related posts