ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేతపై జరిగిన సందర్భంగా విపక్ష నేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాలపై చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజావేదిక భవనాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశానని, అదే తాను చేసిన తప్పన్నారు. తాను అలా చేయకుండా ఉంటే ప్రజావేదిక భవనాన్ని కూల్చేవారు కాదేమోనని సందేహం వ్యక్తం చేశారు. . తన నోరు మూయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటాను తప్ప.. ఎవరి బెదిరింపులకూ తాను భయపడబోనని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు.సభా సమయాన్ని విపక్ష సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సభలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రశ్నకు సంబంధించిన విషయమై మాట్లాడాలని స్పీకర్ చంద్రబాబుకు సూచించారు.