telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి ఐకె రెడ్డి

indrakaran reddy

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో ఆయన నిర్మల్ జిల్లాలో పాల్గొన్నారు. నీలాయిపేట గ్రామంలో ఆయన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు.

ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని అన్నారు. తెలంగాణ పల్లెలను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ శశిధర్‌ రాజు, జెడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts