telugu navyamedia
క్రీడలు వార్తలు

టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లకు వేదికలు ఇవే…

ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం వేదికలను ఖరారు చేసింది. ఈ ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కానుంది. గత ఏడాదే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థను ఆటగాళ్ల కోసం అమలు చేస్తోంది. అక్టోబర్ నాటికి సాధారణ పరిస్థితులు ఏర్పడితే.. ప్రేక్షకులకు అనుమతించే అవకాశాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ ఇదివరకే స్పష్ం చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్‌ల కోసం పరిమితంగానే స్టేడియాలను ఎంపిక చేసింది బీసీసీఐ. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా, ముంబైలోని వాంఖెడె, చెన్నైలోని ఎంఏ చిదంబరం, కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్, బెంగళూరులోని చిన్నస్వామి, హైదరాబాద్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ధర్మశాలలోని హిమాలయా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాలను ఎంపిక చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్.. అందరూ ఊహించినట్టే- గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Related posts