telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాగార్జున‌సాగ‌ర్ లో పెరిగిన పోలింగ్…

నాగార్జున‌సాగ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం భారీగా న‌మోదైంది.. గ‌తంలో న‌మోదైన ఓటింగ్ శాతాన్ని క్రాస్ చేసింది.. సాగర్‌ నియోజకవర్గంలో చైతన్యం ప్రదర్శించిన ఓట‌ర్లు.. ఓవైపు క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్నా.. భ‌య‌పెడుతున్నా.. ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా.. ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంతో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఇంకా, పూర్తి స్థాయిలో అధికారిక స‌మాచారం అందాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ 88 శాతం గా ఉంది.. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం 7 గంటలకు ముగియ‌గా.. తుది పోలింగ్‌ శాతం వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవ‌కాశం ఉంది.. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ రికార్డును ఈ ఎన్నిక‌లు బ్రేక్ చేశాయి.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 86 శాతం పోలింగ్ న‌మోదైతే. ఈసారి ఇప్ప‌టికే 88 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక మొత్తం ప్రకటించే సమయానికి ఇది 90 దాటే అవకాశాలు ఉన్నాయి.

Related posts