తెలంగాణ టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ఇందులో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటారు సింగర్ సునీత.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
ప్రకృతి కన్నతల్లి లాంటిది అని.. కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
ఇప్పటికే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని సినీ రాజకీయ సెలబ్రిటీలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఇప్పటికే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో
ఉన్న ఆయన మొక్కలు నాటారు. ఇటీవలే నటి ప్రాంతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. ప్రశాసన్ నగర్లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు.
అంతా ఆమె వల్లే… మాజీ భార్యపై స్టార్ హీరో కామెంట్స్