ఈ మధ్య కాలంలో మహేష్ సామాజిక నేపథ్యంలో సినిమాలు చేస్తూ అందరిని ఉత్తేజ పరుస్తున్నారు. ఆయన నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్తో తెరకెక్కగా, మూవీ రిలీజ్ తర్వాత కొందరు ప్రముఖులు వెనుకబడిన గ్రామాలని దత్తత తీసుకొని వాటిని అభివృద్దిపరచే పనిలో పడ్డారు. ఇక తాజాగా రిలీజ్ అయిన మహర్షి చిత్రంలో రైతుల విలువను తెలియజేస్తూ ప్రేక్షకుడిలో మంచి ఆలోచన రేకెత్తేలా తెరకెక్కించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా స్పూర్తితో చాలా మంది వీకెండ్ వ్యవసాయంతో బిజీ అయ్యారు.
మహేష్ తనకి వీకెండ్ వ్యవసాయం అన్న కాన్సెప్ట్ చాలా నచ్చిందని చెబుతూ తాను పొల్లం దున్నుతున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు మధుర శ్రీధర్. అలానే అమిత్ సజానే అనే నెటిజన్ కూడా మహర్షి సినిమా నుండి స్పూర్తి పొంది వ్యవయసాయం చేస్తున్నానని తెలిపాడు. అయితే మహర్షి చిత్రంలోని సందేశాన్ని అర్దం చేసుకొని వాటిని ప్రేక్షకులు ఆచరణలో పెడుతున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం అంటున్నాడు మహేష్. వీకెండ్ వ్యవసాయానికి మంచి స్పందన వస్తుంది. బంగారు భవిష్యత్కి ఇది గొప్ప ప్రారంభం. మన తరాలకే కాదు భావితరాలకి కూడా అని మహేష్ తన పోస్ట్లో పేర్కొన్నారు. అయితే మహర్షి సినిమా కనెక్ట్ అయిన చాలా మంది ప్రజలు తమ పొలంలో వ్యవసాయం చేస్తున్న ఫోటోలని మహేశ్కు, ‘మహర్షి’ చిత్రబృందానికి ట్యాగ్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు. చిత్రానికి వస్తున్న ఇంత ఆదరణని చూసి చిత్ర బృందం చాలా హ్యాపీగా ఫీలవుతుంది.