ఈనాడు అంటే గుర్తొచ్చే పేరు.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు. ఆయన మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామోజీఫిల్మ్సిటీ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులను ప్రముఖులు ఆశీర్వదించారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సీవీసీ కేవీ చౌదరి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్ దంపతులు, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తదితర ప్రముఖులు విచ్చేశారు. రాజకీయ ప్రముఖులు.. ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, హరీశ్రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, మంత్రి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, కేశినేని నాని, ఎల్ రమణ, మహమూద్ అలీ, సుబ్బరామిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధ ప్రసాద్, జయ ప్రకాశ్ నారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్రెడ్డి, జి.వివేక్, కొండ్రు మురళి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిటాల సునీత, కొనకళ్ల నారాయణ తదితరులు తరలివచ్చారు.
ఈ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులలో .. చిరంజీవి దంపతులు, వెంకటేశ్, రాఘవేంద్రరావు, కృష్ణ, కృష్ణం రాజు దంపతులు, అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నరేశ్, దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, అక్కినేని అమల, రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, బోయపాటి శ్రీనివాస్, ఎం.ఎం. కీరవాణి, అచ్చిరెడ్డి, చలపతిరావు, ఆర్.నారాయణమూర్తి, శోభు యార్లగడ్డ, బీవీఎస్ఎన్ ప్రసాద్, సునీల్, శ్రీను వైట్ల, సుశాంత్, కోటి, కోట శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్ తదితరులు ఉన్నారు.
పలువురు పారిశ్రామిక వేత్తలు.. జూపల్లి రామేశ్వరరావు, గ్రంథి మల్లికార్జునరావు, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పొట్లూరి వర ప్రసాద్, ప్రముఖ వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు: టీడీపీ నేత అనురాధ