సినీ నటుడు, ఎంఎన్ఎం (మక్కళ్ నీది మయ్యం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలోనే టీవీ చానల్ స్థాపించబోతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 7న తన జన్మదినం సందర్భంగా కమల్ చానల్ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంఎన్ఎం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలంటే టీవీ చానల్ తప్పనిసరి అని కమల్ భావిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన పుట్టినరోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కమల్ సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ గలాన్ని గట్టిగా వినిపించేందుకు చానల్ ఉపకరిస్తుందని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు జరుపుతున్న కమల్ ఆయన సూచనల మేరకే టీవీ చానల్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది.