పర్యావరణ పరిరక్షణకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిలిపి వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వస్తువుల నిషేదానికి శ్రీకారం చుడదామని ఆల్ ఇండియా రేడియో ప్రసంగం మన్ కీ బాత్లో పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ‘ మీ నిర్ణయం చాలా గొప్పది. దాన్ని స్వాగతిస్తున్నా. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం’ అని ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ట్విటర్ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఆమిర్ఖాన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మోదీ ట్వీట్ చేశారు.