telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోడీ పేరు గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించాలి ; కాంగ్రెస్‌ నేత

మాజీ మంత్రి శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ – వైద్యం పట్ల తనకున్న ఆలోచనలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చానని… ప్రధాన మంత్రి మోడీ చేస్తున్న పనులు నచ్చి ఆయనకు భారత రత్న ఇవ్వాలని రాష్టపతిని కోరుతున్నానని తెలిపారు. 3 సార్లు ముఖ్యమంత్రి, ఆరున్నర సంవత్సరాలు ప్రధానిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారన్నారు. కరోనా మహమ్మారి వంటి రోగాలు ప్రబలకుండా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. స్వచ్ఛ భారత్, Gst, త్రిఫుల్ తలాక్ మంచి పేరు తెచ్చాయని… 53 శాతం మంది 60 ఏళ్ళు దాటిన వారికే కరోనా ఎక్కువ సోకుతుందన్నారు. దేశంలోని 27 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గిందని… మిగతా రాష్ట్రాల్లో పెరిగిందని పేర్కొన్నారు. 90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని… ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో నరేంద్రమోదీ పేరు నమోదు చేయాలని… బీజేపీలోకి తాను వెళ్లబోనని… తన అభిప్రాయాలను మాత్రమే చెప్పానని పేర్కొన్నారు.

Related posts