హిందూ దేవుళ్లపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేకెత్తించాయి ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సాధుపరిషత్ మంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది.
ఆంజనేయుని బొమ్మ విరిస్తే వచ్చిన నష్టం ఏమిటి? కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల విలువ మహా అయితే రూ. 6 లక్షలు ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించడంపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన ఆయన నాని వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.