టాలీవుడ్ నటుడు శివబాలాజీ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ పరీక్షలతో కార్పోరేట్ స్కూల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఫీజులతో ఒత్తిడి చేస్తున్నాయని, ఇది సరైనది కాదని శివబాలాజీ పేర్కొన్నారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ ఐడిలను బ్లాక్ చేస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అయన వాపోయారు. ఈ దోపిడిని ప్రభుత్వం అడ్డుకోవాలని శివబాలాజీ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క పేరెంట్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ పోరాటానికి తనకి సపోర్టు చేయాలని శివబాలాజీ కోరారు. అటు తాము ఇప్పటికే 35% ఫీజు చెల్లించినప్పటికీ తమ పిల్లలను పరీక్ష రాయనివ్వడం లేదని శివ బాలాజీ భార్య మధుమిత అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని మధుమిత అన్నారు.ఇంతకుముందే శివబాలాజీ ఆన్లైన్ క్లాసుల పేరిట ప్రైవేట్ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నారంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై మండిపడుతూ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ)కి కూడా ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…