telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి త్వరగా కోలుకోవాలంటూ సెలెబ్రిటీల ట్వీట్స్

chiru

కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. వారు వీరి అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు.  ”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని ట్విట్ చేసారు మెగాస్టార్. అయితే చిరు మొన్న తెలంగాణ సీఎం కేసిఆర్ ను కలిశారు. మరో హీరో నాగార్జున తో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు చిరు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమా తరవాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించనున్నాడు చిరు. వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.  ఇక కరోనా బారిన పడ్డానని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పేర్కొనడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ధైర్యం చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. మంచు లక్ష్మి, నాగబాబు, వరుణ్ తేజ్, ఉపాసన, రవితేజ, నితిన్ సహా పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఆయన తిరిగి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు.

Related posts