సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. ఈ సినిమా తర్వాత `బాహుబలి` ప్రభాస్తో సురేందర్ రెడ్డి పనిచేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి ఓ స్క్రిప్టు సిద్ధం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓ స్టైలిష్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. స్టైలిష్ ఎంటర్టైనర్లు రూపొందించడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. ప్రభాస్కు సరిపడే లైన్ సురేందర్ రెడ్డి వద్ద ఉందట. ప్రభాస్తో త్వరలోనే సురేందర్ రెడ్డి కథా చర్చలు జరుపబోతున్నాడని సమాచారం. మరి, ప్రభాస్ కనుక ఓకే చెప్పేస్తే వీరి కాంబినేషన్లో ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ రావడం ఖాయమని విశ్లేషణలు వినబడుతున్నాయి.
next post