తన 57వ చిత్రంతో మాత్రం తన నట ప్రస్థానానికి కొత్తగా “నాంది” పలుకుతున్నారు నరేశ్. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నరేశ్ పుట్టినరోజు(జూన్ 30) సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇప్పటి వరకు నరేశ్ చేసిన చిత్రాలన్నింటిలో ఈ సినిమా డిఫరెంట్ అని టీజర్ను చూస్తేనే అర్థమవుతుంది. ఈ టీజర్ను హీరో విజయ్ దేవరకొండ ఈ టీజర్ను విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. “దేశవ్యాప్తంగా 2015 నాటికి 29 రాష్ట్రాల్లో 1401 జైళ్లు ఉన్నాయి. 3, 66, 781 మంది ఖైదీలు రకరాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 2,50,000 తప్పు చేశామో, చేయ్యలేదో తెలియకుండా అండర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు’ అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ చాలా ఉత్కంఠంగా సాగింది. అసలు నరేశ్ను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? అనే విషయాన్ని టీజర్లో చూపించలేదు కానీ.. నరేశ్ చేయని నేరానికి అరెస్ట్ అయ్యి.. పోలీసులు దగ్గర చావు దెబ్బలు తినడాన్ని టీజర్లో చూపించారు. అండర్ ట్రైల్ ఖైదీకి కూడా ఇలాంటి శిక్షలు ఉంటాయా? అనేలా ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి. ‘‘మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. కానీ నాకు న్యాయం చెప్పడానికేంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది’’ అనే డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ సినిమాకు హైలైట్ కానుంది. అలాగే కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో నటిస్తుంది. ఆమె పాత్రను కూడా ఈ టీజర్లో రివీల్ చేశారు. హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.వినూత్న కథతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
previous post