జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ కి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో జంపింగ్లు ఎక్కువయ్యాయి. టీఆర్ఎస్కి వెళితే… ప్రాధాన్యం దొరకదని భావించిన నేతలు… బీజేపీ పార్టీ లోకి వెళుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆ నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా కూడా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న భిక్షపతి యాదవ్ బీజేపీ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఇప్పటికే కొప్పుల నర్సింహ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లో చేరగా… నేడు మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీ పార్టీ లో చేరనున్నారు. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టు సమాచారం అందుతోంది.
previous post