telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ అంత్యక్రియలకు రాలేదేం… బాలీవుడ్ ప్రముఖులపై హీరోయిన్ ఫైర్

Nikisha-Patel

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాలీవుడ్‌లో మంచి కెరీర్ సాగుతున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం చెందడం అందర్ని షాక్‌కు గురి చేసింది.బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బయటి నుంచి వచ్చిన వారిని కొందరు ఎదగనివ్వడం లేదని కంగన, తాప్సీ, శ్రద్ధాదాస్, పాయల్ వంటి హీరోయిన్లు ఇప్పటికే విమర్శించారు. ఇప్పుడు వీరితో `కొమురం పులి` హీరోయిన్ నికీషా పటేల్ కూడా గొంతు కలుపుతోంది. బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ నికీషా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నాది ఒకే ఒక్క ప్రశ్న. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులెవరూ ఎందుకు హాజరు కాలేదు. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా. మానవత్వం ఎక్కడుంది?” అంటూ నికీషా ఘాటుగా ప్రశ్నించింది. నికీషా ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ‘సుశాంత్ మృతికి కారణమైన వారెవరూ అతని అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Related posts