లాక్డౌన్ కారణంగా భారీ బడ్జెట్తో, చిన్న బడ్జెట్తో తీసిన వందకు పైగా చిత్రాలు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్తో తీసిన చిత్రాలను అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక హీరోయిన్గా నటించిన ‘పొన్మగల్ వందాళ్’, కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడిదే కోవలో ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘డేనీ’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేపడుతున్నారు. ‘డేనీ’ చిత్రంలో వరలక్ష్మితో పాటు యోగిబాబు, షియాజీషిండే, వేల్ రామమూర్తి తదితరులు నటించారు. సంతోష్ దయానిధి సంగీతం సమకూర్చారు. పీజీ ముత్తయ్య నిర్మించిన ఈ చిత్రానికి సంతానమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు తమిళ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడి బుధవారంతో వందరోజులైంది.
previous post