telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో స్కూళ్ల రీఓపెనింగ్ మరోసారి వాయిదా!

school students

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల రీఓపెనింగ్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనపై క్లారీటీ ఇచ్చింది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబరు 2న స్కూళ్లు తెరచుకొనున్నాయి.

తెరుచుకుంటాయి.పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు అందజేయనున్నారు. ఈ కానుకలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.

Related posts