తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చూపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఈ రోజు డబుల్ బెడ్రూం ఇళ్లపై మరోసారి స్పందించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇప్పటికే లక్ష ఇళ్లు కట్టామని తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .డబుల్ బెడ్రూం ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు.
హైదరాబాద్లోని నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెప్పిందని, అయితే అక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్టు సర్కారు చెప్పిందని, అందులోనూ ఎన్నో అవకతవకలు ఉన్నాయని తెలిపారు.
నీ స్పీడ్ కాంగ్రెస్ లో చెల్లదు ..రేవంత్ కు వీహెచ్ చురకలు