telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అవంతి!

Hemanth Murder Hyd

హైదరాబాదు నగరంలో హేమంత్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకొని పరువు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ భార్య అవంతి తన తండ్రి లక్ష్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హేమంత్ తల్లిదండ్రులను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అవంతి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు తమకు రక్షణ కల్పించాలంటూ ఆమె గచ్చిబౌలి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

గచ్చిబౌలిలో హేమంత్ తో కలిసి ఉన్న ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకువచ్చేందుకు వెళితే, తనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించారని అవంతి తెలిపారు.తన మరిదిని కూడా ఇదే విధంగా అనుసరిస్తున్నారని ఆమె వెల్లడించారు. కాగా, అవంతి తన అత్తమామలతో కలిసి సీపీ సజ్జనార్ ను కలిసి తమకు భద్రత కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.

Related posts