మంగళగిరి అభివృద్దికి రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చి దిద్దుతామని అన్నారు.
రెండు నెలల్లోనే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో లోకేశ్ ను ఈ ప్రాంత ప్రజలు ఓడించారని అన్నారు.