telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పొట్టి వీరయ్య సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్…

ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తు చేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య ఈరోజు సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఇక రేపు పొట్టి వీరయ్య అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేసారు. అయితే పొట్టి వీరయ్యకు భార్య మల్లికతో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Related posts