telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

దూబే అనుచరుల కోసం గాలింపు..గ్వాలియర్‌లో మరో ఇద్దరి అరెస్ట్

vikas dubay

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే  ఎన్  కౌంటర్ లో హతమైన తర్వాత అతడి అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి అనుచరుడైన బ్రిక్రు గ్రామానికి చెందిన దయాశంకర్ అగ్నిహోత్రికి చెందిన రేషన్ షాపు నుంచి నిన్న ఏడు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను హతమార్చిన కేసులో నిందితులైన దూబే ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో యూపీ పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు.

దూబే ముఠా సభ్యులైన ఓం ప్రకాశ్ పాండే, అనిల్ పాండేలు గ్వాలియర్‌లోని రహస్య స్థావరంలో దాక్కున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిద్దరూ మరో రహస్య స్థావరానికి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్టు కాన్పూర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ జేఎన్ సింగ్ తెలిపారు.

 

Related posts