telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : మళ్ళీ తడబడిన సన్‌రైజర్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సూపర్ యువర్ లో విజయం సాధించి మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఢిల్లీ. అయితే ఈ మ్యాచ్ లో 160 పరుగుల లక్ష్యంతో వచ్చిన సన్‌రైజర్స్ ఎప్పటిలాగే మధ్యలో తడబడింది. కానీ కేన్ విలియమ్సన్ చివరి వరకు క్రీజులో ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో సన్‌రైజర్స్ తరపున వార్నర్, విలియమ్సన్ బ్యాటింగ్ కు వచ్చి కేవలం 7 పరుగులు చేసారు. దాంతో 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన ఢిల్లీ చివరి బంతికి విజయం సాధించింది. అయితే ఈ విజయంతో ఐపీఎల్ 2021 లో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

అయితే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా(53) అర్ధశతకంతో రాణించాడు. ఆ తర్వాత స్మిత్(34) చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది ఢిల్లీ జట్టు.

Related posts