telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు వీకెండ్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య మ్యాచ్ లు జరుగుతుండగా ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్ (28) పరుగులు చేయగా పృథ్వీ షా(53) అర్ధశతకంతో అదరగొట్టాడు. కానీ వీళ్ళు ఔట్ అయిన తర్వాత రిషబ్ పంత్ (37) ముడో వికెట్ కు 58 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పాడు. అయితే స్మిత్(34) చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది క్యాపిటల్స్. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే హైదరాబాద్ 160 పరుగులు చేయాలి. అయితే ఈ లక్ష్యం చేధించదగినదే అయిన సన్‌రైజర్స్ కు మాత్రం ఈ టార్గెట్ ఛేదించడం కష్టం. గతంలో సన్‌రైజర్స్ మూడు మ్యాచ్ లలో దాదాపు ఇదే లక్ష్యాన్ని చేధించలేక ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది చూడాలి.

Related posts