telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : మైండ్ బ్లాక్ సాంగ్ వచ్చేసింది…

SN

మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమా పై అంచనాలు కూడా పెంచడం జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి “మైండ్ బ్లాక్” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts