telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హజ్ యాత్రలో గాయపడ్డ తెలంగాణ వ్యక్తి…95లక్షలు వైద్యం కోసం ఇచ్చిన సౌదీ..

saudi released 95 lakhs to hajj yatra disciple

సౌదీ ప్రభుత్వం హజ్ యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసింది. చికిత్స కోసం రూ.95లక్షలు రిలీజ్ చేసింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ముజీబ్ కుటుంబానికి అందజేశారు. శనివారం ముజీబ్ కుటుంబాన్ని కలిసిన హోంమంత్రి..అతడి ఆరోగ్యంపై వాకబు చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో సౌదీ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఓ వ్యక్తి చికిత్స కోసం విడుదల చేసిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంలోనే పోలీస్ రిక్రూట్ మెంట్ లో అక్రమాలపై హోంమంత్రి స్పందించారు. ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. రిక్రూట్ మెంట్ పారదర్శకంగా నిర్వహించామన్నారు. తెలంగాణలో రోహింగ్యాల సంఖ్య చాలా తక్కువ ఉందన్న హోంమంత్రి.. రోహింగ్యాలతో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు ప్రభుత్వం షెల్టర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను ఆశ్రయం ఇచ్చాననేది అవాస్తవం అన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో నామినేషన్ వేసే హక్కు ఉందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

Related posts