telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న షారుక్, సల్మాన్

SRK

బాలీవుడ్ ఖాన్లు షారూక్‌, సల్మాన్‌లు మరోసారి కలిసి స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారూక్‌.. పఠాన్ అనే మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. వార్‌, బ్యాంగ్ బ్యాంగ్ మూవీల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఇందులో దీపికా హీరోయిన్‌గా నటించనుండగా, జాన్ అబ్రహం విలన్‌గా కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సల్మాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సల్మాన్ 10 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు టాక్‌. కాగా ఈ మూవీతో పాటు రాజ్ కుమార్ హిరానీ, అట్లీ దర్శకత్వాల్లోనూ షారూక్ నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా సల్మాన్, షారుఖ్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాదు ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రలో కూడా మెరిశారు.

Related posts