ప్రస్తుతం కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. భారత్లో కోవిడ్ విలయమే సృష్టిస్తోంది.. ఈ తరుణంలో మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ.. భారత్కు పిలుపునిచ్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు ఇమ్రాన్. ఆయన ట్వీట్ను పరిశీలిస్తే.. భారత్ కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తోంది.. వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాల్పై మనమంతా కలిసికట్టుగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. అయితే చూడాలి మరి దీని పై మన భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది.
previous post