ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేననతగా నగరంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ వరదలతో జన జీవనం స్తంభించిపోయింది. ఎటు వెళ్లాలన్నా వరదలకు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షాలకు అండర్ పాస్లో కారు ఇరుక్కుపోయి ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకారం, ఇర్ఫాన్ ఖాన్(37), గుల్షన్ షేక్(38) సోమవారం అర్థరాత్రి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అండర్పాస్లోకి ప్రవేశించారు. అక్కడ కారు నీటిలో ఇరుక్కుపోవడంతో ఇంజిన్లోకి వరద నీరు ప్రవేశించింది. వెంటనే వారు కారును స్టార్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమవగా పెద్ద వరద వచ్చేసి కారును పూర్తిగా చుట్టుముట్టింది. దీంతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి