కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ క్యాబినెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు తన రాజీనామాను సీఎం అమరీందర్ సింగ్కు పంపించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సీఎం అమరీందర్ అధికార నివాసానికి రాజీనామా లేఖను పంపించినట్లు చెప్పారు.
గత జూన్ 10వ తేదీనే సిద్దూ తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి సమర్పించారు. సీఎం అమరీందర్ క్యాబినెట్లో మార్పులు చేయడంతో సిద్ధూ కీలక శాఖలను కోల్పోయారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్దూ కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకాలకు తన నిర్ణయం గురించి తెలియపరిచారు.
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్రెడ్డి