కేరళ రాష్టంలోని శబరిమలలో ఇటీవల జరిగిన సంఘటనలను చిత్రీకరిస్తున్న ఓ వీడియో జర్నలిస్ట్ పై ఆందోళకారులు దాడి చేశారు. కైరాలీ టీవీకి చెందిన మహిళా వీడియో జర్నలిస్టు శైలజా అబ్దుల్ రెహమాన్ వీపుపై హఠాత్తుగా ఎవరో గట్టిగా తన్నారు. ఈ వృత్తిలో నేను ఎదుర్కొన్న అత్యంత దారుణమైన అనుభవం ఇది అంటూ కంటతడి ఆమె పెట్టుకున్నారు.
వీపుపై దాడి జరిగిన అనంతరం కింద పడినప్పటికీ.. ఆమె వార్తను చిత్రీకరిస్తున్న ఫొటోను మాతృభూమి పత్రిక ప్రచురించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరు నన్ను వెనుక నుంచి తన్నారో తెలియదు. నేను బాధతో తల్లడిల్లుతుండగానే కొందరు నా కెమెరాను లాక్కోవడానికి ప్రయత్నించారు. నా బలమంతా కూడదీసుకొని కెమెరాను గట్టిగా పట్టుకున్నాను. ఈ పెనుగులాటలో నా మెడకు గాయమైంది అని చెప్పారు.
తెలంగాణలో మహాకూటమి.. ఏపీలో ముసుగు కూటమి: వైసీపీ ఆరోపణ